మీ మౌనం ఇక ఎంతమాత్రం పరిష్కారం కాదు -కవిత

(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ…

శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం…