పశ్చిమ బెంగాల్లో వామపక్షాల భారీ ఓటమి
1977 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన వామపక్ష కూటమి ఎల్.డి.ఎఫ్ 2011 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యింది. కేరళలో మాత్రం కొద్దిలో అధికారానికి దూరమయ్యింది. ముఠా తగాదాలను అధిగమించినట్లయితే కేరళలో అధికారం నిలిచేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు పార్లమెంటరీ రాజకీయాలు చేపట్టడంతోటే కమ్యూనిస్టు సిద్ధాంతాలనుండి వైదొలిగాయని భారత దేశంలోని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు ఎప్పటినుండో వాదిస్తూ వచ్చాయి. 1968 లో సి.పి.ఎం పార్టీ నయా రివిజనిజాన్ని చేపట్టిందని నిర్ణయించుకున్న అనేక…