కరాచిపై పాక్ తాలిబాన్ దాడులు, శాంతి ఎప్పటికి? -ఫోటోలు

‘ఆ, శాంతి గాక ఇక ఏమున్నదిలే!” అని సత్యహరిశ్చంద్రుడు కాటి సీన్ చివరి అంకంలో దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం పరిస్ధితి అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్ధాన్ ను ఖాళీ చేయడానికి అమెరికా ముహూర్తం పెట్టుకున్న నేపధ్యంలో తాలిబాన్ తో శాంతి చర్చలు ఫలించే సూచనలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఆఫ్ఘన్ తాలిబాన్ తో ఆఫ్ఘన్ ప్రభుత్వం శాంతి చర్చలు విఫలం అవుతుండగానే పాక్ తాలిబాన్ తో పాక్…

అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం…

‘మలాల యూసఫ్జాయ్’: 14 యేళ్ళ బాలిక చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు -కార్టూన్

పాకిస్ధాన్ పశ్చిమ రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోని స్వాట్ లోయలో ‘మలాల యూసఫ్జాయ్’ అనే 14 సంవత్సరాల బాలికపై హత్యా ప్రయత్నం జరిగింది. అక్టోబర్ 9 తేదీన ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ను మిలట్రీ చెక్ పోస్టుకి సమీపంలోనే ఆపి, దుండగులు ఆమె తలపైనా, గొంతులోనూ కాల్పులు జరిపారు. బాలికా విద్య కోసం ప్రచారం చేస్తున్నందుకు ఆమెను పాకిస్ధాన్ తాలిబాన్లు చంపడానికి ప్రయత్నించారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం లంకించుకున్నాయి. పాకిస్ధాన్ లో వైద్యం సరిపోలేదని…

పాకిస్ధాన్ నావల్ బేస్‌పై పాక్ తాలిబాన్ దాడి దృశ్యాలు -ఫోటోలు

సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు…

పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా

వరుసగా ఎదురవుతున్న అవమానాలతో పాక్ మిలట్రీ అందరినుండీ దూషణలను, తిరస్కారాలనూ ఎదుర్కొంటోంది. అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి లాడెన్ హత్య చేయనున్న విషయం తమకు తెలియకుండా జరిగిందని చెప్పడం, సి.ఐ.ఏ గూఢచారులు వందల సంఖ్యలో పాక్‌లో ఉన్నట్లు వెల్లడి కావడం, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినా సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ను ఏ శిక్షా లేకుండా విడిచిపెట్టడం, అవసరమైతే ఇంకోసారైనా పాక్‌లో జొరబడ్డానికి వెనకాడం అని ఒబామా ప్రకటించినా అదేమని అడగకుండా నోర్మూసుకుని…