2014 నేషనల్ జాగ్రఫిక్ ఫోటో పోటీ విజేతలు -ఫోటోలు
నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ 2014 సంవత్సరానికి గాను ఫోటో పోటీ విజేతలను ప్రకటించింది. ఎప్పటిలాగానే జనం (People), ప్రకృతి (Nature), స్ధలం (Places) అనే మూడు విభాగాల్లో పోటీ నిర్వహించబడింది. అత్యున్నతమైన గ్రాండ్ బహుమతిని పీపుల్ విభాగం విజేతకు దక్కింది. హాంగ్ కాంగ్ లో చీకటి ఆలుకుని ఉన్న ఒక రైలు పెట్టెను ఒక యువతి చేతిలోని మొబైల్ ఫోన్ ప్రకాశింపజేస్తున్న దృశ్యాన్ని బ్రియాన్ యెన్ చిత్రీకరించగా అది గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంది. మొబైల్ ఫోన్…
