ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్

“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…

అల్లరి మూకల్ని మోస్తూ అభివృద్ధి ఎలా సాధ్యం? -కార్టూన్

“అబ్బే అలాంటిదేమీ లేదు- డెలివరీ ఇవ్వాల్సిన చిన్న పార్సిల్, అంతే…” హిందూత్వ బ్రిగేడ్ లో ఫ్రింజ్ గ్రూపులది ప్రత్యేక స్ధానం. సదరు గ్రూపులు మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టి ప్రజల్లో విభేదాలు సృష్టిస్తే ఆ విభేదాలు ఆసరాగా గంభీర వదనాలతో ఓట్లు నంజుకు తినడం బి.జె.పి నేతల పని. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి గుజరాత్ హత్యాకాండ మీదుగా ముజఫర్ నగర్ అల్లర్ల వరకు జరిగింది ఇదే. అయితే కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిస్ధితిలో కొద్దిగా…

లౌకికవాదం ఒక విధాన ఎంపిక కాదు -ది హిందు ఎడిట్

[“Secularism is not a policy option” శీర్షికన ఈ రోజు -ఫిబ్రవరి 19- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. ఇది చాలా విలువైన ఆర్టికల్. ముఖ్యంగా (ఆంగ్లం ఒరిజినల్ లో) రెండవ పేరాలో (అనువాదంలో చివరి పేరాలో) ప్రస్తావించిన అంశాలు కలకాలం గుర్తు పెట్టుకోవలసినవి. పాఠకులు వీలయితే బట్టీయం వేసి సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రీ ప్రొడ్యూస్ చేసినా తప్పు లేదు. -విశేఖర్] ********** మతం ప్రాతిపదికన హింసా, విద్వేషాలను…

ప్రధాని అయ్యాక ‘రాజధర్మం’ గుర్తుకొచ్చింది! -కార్టూన్

“ఏ సాకుతో అయినా సరే, ఏ మతానికైనా వ్యతిరేకంగా హింస జరగడం మనం ఆమోదించరాదు. అలాంటి హింసను నేను గట్టిగా ఖండిస్తాను. ఈ విషయంలో నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.” “(మతపరమైన) విశ్వాసం కలిగి ఉండడంలో పూర్తి స్ధాయి స్వేచ్ఛ ఉండేలా నా ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అవాంఛనీయ ప్రభావం లేకుండా అతడు/ఆమె తనకు ఇష్టమైన మతంలో కొనసాగేందుకు లేదా అనుసరించేందుకు, ఎవరూ నిరాకరించలేని హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారని గుర్తిస్తుంది. బహిరంగంగా…

అరవింద్, మోడిల సమావేశం -కార్టూన్

  ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి. ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు. దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా…

బి.జె.పిలో మోడి, షా లదే రాజ్యం -కార్టూన్

కాంగ్రెస్ కంటే తమది విభిన్నమైన పార్టీ అని బి.జె.పి నేతలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో సంస్ధాగత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదని, కేవలం కుటుంబ స్వామ్యమే ఉన్నదని వెంకయ్యనాయుడు లాంటి నేతలు తరచుగా ఆరోపిస్తారు. అలాంటి బి.జె.పి లోనూ నేడు కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులదే ఇష్టా రాజ్యం అయిందని ఈ కార్టూన్ చెబుతోంది. బి.జె.పి చిహ్నం కమలంలో వికసించిన పూ రెమ్మలు మోడి అయితే, వాటికి పత్రహరితాన్ని పోషణగా అందించే ఆకులు అమిత్ షా అని కార్టూనిస్టు…

ఒబామా మోడీల అణు కౌగిలి -కార్టూన్

రిపబ్లిక్ డే రోజున భారత సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆ ముందు రోజున భారత ప్రధాని మోడితో మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం 2008లో కుదుర్చుకున్న ‘పౌర అణు ఒప్పందాన్ని’ ఆపరేషనలైజ్ చేసేందుకు తాము ఒక అంగీకారానికి వచ్చామని ఇరువురు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇంతవరకు జనానికి చెప్పలేదు. అమెరికా అధికారులకు తెలిసిన ఒప్పందం వివరాలు భారత ప్రజలకు ఎందుకు తెలియకూడదు? భారత ప్రజలకు చెప్పకూడని…

అనిశ్చితికి ముగింపు పలకండి! -ది హిందూ ఎడిట్

(ది హిందు, ఫిబ్రవరి 3, 2015 నాటి సంపాదకీయం ‘End the ambivalence’ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ********** రాజ్యాంగం పీఠిక నుండి ‘లౌకిక’ మరియు ‘సామ్యవాద’ పదాలను తొలగించాలన్న డిమాండ్లపై తలెత్తిన వివాదాన్ని తప్పించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సరిగ్గానే కృషి చేశారు. ది హిందు కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక అంతకంటే స్పష్టత ఉండబోదన్న రీతిలో వివరించారు: “ప్రస్తుతం ఉన్న పీఠిక ఇప్పుడు ఉన్నట్లుగానే యధాతధంగా…

మోడి: ఇక ఛలో చైనా!

అమెరికా వెళ్ళి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడి త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడి చైనా సందర్శనకు తగిన దౌత్య ఏర్పాట్లు చేయడం కోసం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత తీవ్రం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుష్మా పేర్కొనడం విశేషం. ఇందుకోసం ఇరు దేశాల మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ తో పాటు చైనా దౌత్యవేత్తలు సైతం…

నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు…

వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…

బి.జె.పి పాత్రధారుల పరిణామక్రమం

బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి. ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు…

మోడి సరైన చర్య తీసుకుని తీరాలి -ది హిందు

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉప మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మత మైనారిటీలను ఉద్దేశిస్తూ వారు అక్రమ సంతానం అంటూ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషంతో కూడినవి, రెచ్చగొట్టేవి మరియు ఒక ఉన్నత ప్రభుత్వ కార్యాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తికి తగనివి. ఆమె చెప్పిన క్షమాపణలు బలహీనంగా వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రకటనలు చేసేప్పుడు నడవడిక కోల్పోవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీ…

మోడి దౌత్య మర్యాద ఉల్లంఘించారు -నేపాల్ పత్రికలు

సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం…