అద్వానీ స్ధానం అదే! -కార్టూన్

“చివరికి ఈ పరిస్ధితి వచ్చిందా! మన గురువుగారు అద్వానీజీని గురువు స్ధానంలోనే ఉండమని నచ్చజెప్పడానికి ఒక రధయాత్ర చేయాల్సివచ్చిందన్నమాట!” మొత్తం మీద బి.జె.పి పార్టీకి ఒక యజ్ఞం పూర్తయింది. ప్రధాన మంత్రి పదవి కుర్చీలో కూర్చోవాలన్న అద్వానీ కలను నరేంద్ర మోడి గద్దలా వచ్చి తన్నుకుపోయారు. రధయాత్రతో మత ఘర్షణల మంటలు రేపి పార్లమెంటులో సీట్ల చలి కాచుకున్న గురువు గారికి, దేశచరిత్రలో మచ్చగా మిగలాల్సిన కరసేవకుల దహనాన్ని ముస్లింల దహనకాండతో మాపుకున్న శిష్యుడు! గురువును మించిన…

అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం

హాలీవుడ్ యాక్షన్ ధ్రిల్లర్ ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమాలో హీరో, విలన్ ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇప్పుడంటే అలాంటి గ్రాఫిక్ సీన్లు మామూలయ్యాయి గాని రెండు దశాబ్దాల క్రితం ఆ తరహా గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని నిజంగానే భవిష్యత్తుకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఆ విలన్ ఏ పాత్రలోకయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. రంధ్రాల గుండా, సందుల గుండా ఎక్కడికంటే అక్కడికి పాదరసంలా జారిపోతూ కావలసిన రూపంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు. ఇప్పుడు బి.జె.పిలో…

ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి…

పరిక్రమ: మోడి వోటు బ్యాంకుకు రూటు -కార్టూన్

– బి.ఎజే.పి ప్రచార రధ సారధి మోడితో: మన పైలట్ వాహనం దెబ్బతిని కూలిపోయింది! – ఉత్తర ప్రదేశ్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన ‘చౌరాసి కోసి పరిక్రమ యాత్ర’ దాదాపు అభాసుపాలయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం వి.హెచ్.పి యాత్రపై విరుచుకుపడడంతో యాత్ర లాంఛనప్రాయంగా ప్రారంభం అయినట్లు ప్రకటించి ఊరుకున్నారు. అసలు పరిక్రమ యాత్ర ఇప్పటికే సాంప్రదాయ బద్ధంగా నిర్దిష్ట కాలంలో తాము పూర్తి చేయగా వి.హెచ్.పి తలపెట్టిన యాత్ర…

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న

“Politics is the last refuge of scoundrels.” అని పెద్దాయన జార్జి బెర్నార్డ్ షా ఏ సందర్భంలో, ఎందుకు అన్నారో గానీ దాన్ని రుజువు చేయడానికి భారత రాజకీయ నాయకులు అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. అమార్త్య సేన్ తన భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటూ ‘నరేంద్ర మోడి ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పిన సందర్భం వారికి మరోసారి కలిసొచ్చింది. తన అభిప్రాయం చెప్పినందుకు కొందరు బి.జె.పి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక…

హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్

హిందుత్వను ప్రభోదిస్తూ దాన్నుండి దూరంగా ఉన్నారన్న భ్రమల్ని ప్రజల్లో కలిగించడం అంటే మాటలు కాదు. అలాంటి బృహత్కార్యాన్ని విజవంతంగా నిర్వహించినవారిలో ప్రముఖులు అటల్ బిహారీ వాజ్ పేయ్. హిందూత్వలో మోడరేటర్ గా ముద్ర పొందుతూనే అవసరం వచ్చినప్పుడు కరడు గట్టిన హిందూత్వను ప్రదర్శించడం వాజ్ పేయి కి మించినవారు లేరు. తాను కరకు ఆర్.ఎస్.ఎస్ వాడినని చెబుతూనే సెక్యులరిస్టులకు, హిందూత్వ నుండి దూరంగా ఉండదలచినవారికీ ఆయన ఆమోద యోగ్యుడు కాగలిగారంటే అది వాజ్ పేయి చాతుర్యమే అని…

మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది. వాస్తవానికి ఈ…

మోడీకి అమెరికా వీసా కావాలట!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అమెరికా వీసా కావాలి. ఈ మేరకు తాము అమెరికాను కోరనున్నట్లు బి.జె.పి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా తన మనసులో మాట వెలిబుచ్చారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ అక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం…

గుజరాత్ హత్యాకాండ: నేను తప్పు చేయలేదు -మోడి

గుజరాత్ మారణకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి పరోక్షంగా సమర్ధించుకున్నారు. తాను ఏది సరైంది అనుకున్నానో అదే చేశానని నరేంద్ర మోడి రాయిటర్స్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధులు ఆయన మాటలకు దురుద్దేశాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ ఆ మాట నరేంద్ర మోడియే ఎందుకు చెప్పరో అర్ధం కాని విషయం. మోడి తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడం, దానికి అసలు అర్ధాలేవీటో ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు వివరణలకు పూనుకోవడం దేశాన్ని పాలించదలుచుకున్న వ్యక్తులకు,…

ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్: గుజరాత్ పోలీసు సాక్ష్యంలో మోడి పేరు

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ తరపున భావి ప్రధానిగా బి.జె.పి నిలపనున్నదని పత్రికలు ఊహిస్తున్న నేత అయిన నరేంద్ర మోడి మెడపై మరో కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇష్రత్ జహాన్, ఆమె స్నేహితుడు ప్రాణేశ్వర్ పిళ్లై అలియాస్ జావేద్ షేక్, మరో ఇద్దరు యువకుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో, గుజరాత్ పోలీసులు కలిసి ఉమ్మడిగా చేసిన కుట్ర ఫలితంగా నలుగురు అమాయకులు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

నితీష్ కుమార్ ‘మోడీ’కరణ! -కార్టూన్

కేశవ్ నుండి మరో అద్భుతమైన, నిశితమైన, శక్తివంతమైన కార్టూన్! మోడి నియంతృత్వ పోకడలు ఇతర పార్టీలే కాకుండా బి.జె.పి నాయకులు కూడా అనేకమంది విమర్శిస్తారు. తన ప్రధాని కలకు అడ్డువచ్చిందుకు ఎల్.కె.అద్వానీ మోడి సహిత బి.జె.పి పైన చేసిన విషయం ఇంకా పత్రికల్లో నానుతోంది. గోధ్రా అనంతర అల్లర్లను ఆపకుండా రాజధర్మ నిర్వహణలో విఫలమైనందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సైతం మోడీని విమర్శించారు. పరమత విద్వేష పూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ తొగాడియా (విశ్వ…

రాజ్ నాధ్ సింగ్ బహుళ దిశల సవారి -కార్టూన్

బి.జె.పి అధ్యక్షుడి కర్తవ్య నిర్వహణ ఇప్పుడు కత్తి మీది సాము అయింది. కాదు, కాదు… కత్తి మీద సవారీ అయింది. ఆయన అటు ఎన్.డి.ఏ పక్షాలను దారికి తెచ్చుకోవాలి. ఇటు బి.జె.పి లోని నాయకులను ఒక దారిలో నడిచేట్లు చేయగలగాలి. అద్వానీ తిరుగుబాటుతో బి.జె.పి లోని చీలికలు స్పష్టంగా లోకానికి తెలిసి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊహాగానాలతో సాగుతూ, బి.జె.పి నాయకుల తిరస్కరణలతో కప్పి ఉంచబడిన బి.జె.పి లుకలుకలకు అద్వానీ తిరుగుబాటు అచ్చమైన జీవం పోసింది. ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో…