హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…

ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇంటర్నెట్ లోని ఐ.టి కంపెనీలు భారత సాధారణ ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాయి. బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఇంటర్నెట్ ను కూడా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతిభావంతంగా వినియోగించు కోవడం మొదలు పెట్టిన ఈ ధోరణిని ఇతర పార్టీల నేతలు కూడా అనుసరించడంతో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎన్నికల పోరాటానికి వర్చువల్ వేదికలుగా…

ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్…

మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు. గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు. తీరా ఎన్నికలతో పాటు…

మోడి పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండదు -రష్దీ

మోడి నేతృత్వంలోని ప్రభుత్వం అధికరంలోకి వస్తే భారత దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా అడుగంటడం ఖాయం అని ప్రముఖ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సల్మాన్ రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడి అధికారంలోకి రాక మునుపే ఆయన పాలన ఎలా ఉండబోతోందో చాటే ఘటనలు జరుగుతున్నాయని, ఏం రాస్తే ఏమవుతుందో అని భావిస్తూ అనేకమంది సొంతగా సెన్సార్ షిప్ పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ‘పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్…

అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్

జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అస్సాం మతోన్మాద దాడులపై నోరు విప్పారు. ఎన్నికల సమయంలో మతోన్మాద దాడులు చెలరేగడానికి కారణం నరేంద్ర మోడియే అని ఆయన ఆరోపించారు. మూడు రోజుల క్రితం అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన మోడి అస్సాంలో నివశిస్తున్న ముస్లింలు అందరూ విదేశీయులే అని స్ధానికులను రెచ్చగొట్టారని దాని ఫలితమే దాడులు జరిగి డజన్ల మంది మరణించారని ఆరోపించారు. “అస్సాంలో 30 మంది ముస్లింలను చంపేశారు. ఎందుకు? ఎందుకంటే బి.జె.పి ప్రధాన…

కోడ్ పాటించని నేతలు దేశ గతి మారుస్తారా? -కార్టూన్

“నీ ఓటు నాకివ్వు” “నీ తలరాత మార్చేస్తా” “ఈ దేశ గతిని కూడా మార్చేస్తా” “చట్టాన్ని ఉల్లంఘించకుండా ఓటు వెయ్యడం ఎలాగో ముందు నీకు నేర్పి చూపిస్తా పద!” — “అరవై యేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడండి! దేశం గతినే మార్చి చూపిస్తాను.” ఇది నరేంద్ర మోడి అదే పనిగా భారత జనానికి చెబుతున్న మాట! నరేంద్ర మోడీకి నిజంగానే అవకాశం ఇస్తే అది మొదటి అవకాశం మాత్రం…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది

“మోడి అధికారంలోకి వస్తారన్న ఆలోచనే భయం గొలుపుతోంది” అని విదేశాల్లోని భారతీయ మేధావులు ఒక సంయుక్త ప్రకటనలే పేర్కొన్నారు. బ్రిటన్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన యూనివర్సీటీలకు చెందిన బోధకులు ఈ ప్రకటన జారీ చేసినవారిలో ఉన్నారు. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన…

కాశ్మీర్ వేర్పాటువాది జిలానీకి మోడి రాయబారం

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్నది సంఘ్ పరివార్ చిరకాల డిమాండ్. సంఘ్ పరివార్ సంస్ధల్లోనూ, కేడర్ లోనూ హిందూత్వ హార్డ్ లైనర్ గా ప్రసిద్ధి చెందిన నరేంద్ర మోడి కాశ్మీరు వేర్పాటు వాదులతో అందునా హార్డ్ లైనర్ నేతలతో రాయబారం నడుపుతారని ఊహించగలమా? ఊహించలేం. కానీ మోడి ఆ పని చేశారని కాశ్మీరు వేర్పాటువాద నేతల్లో హార్డ్ లైనర్ గా పేరు పొందిన సయ్యద్ ఆలీ…

ప్రమాదవశాత్తు ప్రధాని, ప్రమాదాల ప్రధాని -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్…

మోడి వికాస పురుషుడు కాదు, వినాశ పురుషుడు -ఉమాభారతి

ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఒకరి బండారం మరొకరు బైటపెట్టుకునే పనులు జోరందుకున్నాయి. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటి’ అంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జనానికి ఏమిటి, ఎలా చేస్తామో చెప్పడం మాని ‘నువ్వు వెధవ’ అంటే ‘నువ్వు వెధవ’ అని తిట్టిపోసుకుంటున్నాయి. ‘రీ కౌంటింగ్ మంత్రి’ అని ఒకరు వెకిలి చేస్తే ‘ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి’ అని మరొకరు గుట్టు విప్పుతున్నారు. మోడిపై గతంలో ఉమాభారతి చేసిన విమర్శల వీడియోను తాజాగా వెలికి తీయడం…