ట్రంప్ టారిఫ్ మేనియా -పార్ట్ 2

– ——-మొదటి భాగం తరువాత ప్రధాన ఆర్ధిక పోటీదారు అయిన చైనా దానికదే ఒక కేటగిరీ. చైనా ఉత్పత్తుల పైన 145 శాతం టారిఫ్ లు విధిస్తానని ఒకప్పుడు బెదిరించినప్పటికీ చివరికి 30 శాతం టారిఫ్ తో ట్రంప్ సరిపెట్టాడు. 30 శాతం టారిఫ్ నే ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్లకు దిగుమతి కాకుండా నిరోధించటంలో అమెరికాకి ఉన్న పరిమితులను ఇది వెల్లడి చేసింది. అరుదైన ఖనిజ పదార్ధాల లభ్యతలో చైనా దాదాపు గుత్తస్వామ్యం…

ఇండియాను మళ్లీ బెదిరిస్తున్న అమెరికా

ఎడమ నుండి వరుసగా: విదేశీ మంత్రి మార్కో రుబియో, ట్రంప్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్ అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి పరస్పరం ఒకరి పట్ల మరొకరు గౌరవం, స్నేహ భావన వ్యక్తం చేసుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అమెరికా, ఇండియాను బెదిరించటం మొదలు పెట్టింది. అమెరికా వస్తు సేవల పైన ఇండియా విధిస్తున్న టారిఫ్ లను మళ్లీ ప్రస్తావిస్తూ, అమెరికా నుండి మొక్క జొన్న…

అమెరికాకు పోస్టల్ సేవలు రద్దు చేసిన 25 దేశాలు -యుఎన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్లోబల్ స్థాయిలో తలపెట్టిన Trade Disruption తాలూకు మంటలు కొనసాగుతూ పోతున్నాయి. ఇండియాతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ దేశాల నుండి జరిగే పోస్టల్ సేవలను సస్పెండ్ చేసుకున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి లోని పోస్టల్ సేవల సంస్థ తెలియజేసింది. రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టడం తోనే, ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా కస్టమ్స్ నియమాల లో ఒకటైన గ్లోబల్ డి మినిమిస్…

మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!

India NSA Ajit Doval with Russian President Vladimir Putin ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి…

ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!

ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…

పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం

పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల…

యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం

ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన                                       పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?

– బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు,…

బ్రిక్స్: ఇండియాపై అమెరికా ఆశలు నిలిచేనా?

పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు. రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా…

తూర్పు లడఖ్: చైనా, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం!

10 దేశాల బ్రిక్స్ కూటమి సమావేశాలు రష్యన్ నగరం కాజన్ లో ప్రారంభం కావటానికి రెండు రోజుల ముందు తూర్పు లడఖ్ సరిహద్దు కాపలా విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మాట నిజమేనని ఈ రోజు (అక్టోబర్ 22) చైనా ధృవీకరించింది. ఒప్పందం కుదిరిన సంగతిని సోమవారమే (అక్టోబర్ 21) ఇండియా ప్రకటించింది. ఇండియా ప్రకటనను చైనా ఈ రోజు ధృవీకరించింది. లడఖ్ ప్రాంతంలో చైనా, ఇండియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను…

ఆడవారికి రక్షణ లేని కర్మభూమి!

ఒక్క ఆగస్టు 17, 18 తేదీలలో మాత్రమే ఎన్.డి.టి.వి అనే ఒక వార్తా పత్రిక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరిగిన ఆరు అత్యాచారాల గురించి రిపోర్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలిస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బిజెపి పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ప్రభుత్వ వైఫల్యం గురించి బిజెపి నేతలు విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్…

స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…

సిజెఐ ఇంట్లో గణపతి పూజ: మోడీకి ఆహ్వానం!?

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, భారీ రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తన ఇంట్లో గణపతి పూజ జరిపిన చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిని తన ఇంట్లో జరుగుతున్న పూజకు ఆహ్వానించారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు కారణం అయింది. అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్, రాజ్యాంగం నిర్దేశించిన “అధికారాల సమాన విభజన” (Separation of…

సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…