సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది. నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం…

జగన్ కేసు: హోమ్ మంత్రి సబితను ఊరడించిన తోటి మంత్రులు!?

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం. మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి…