సూర్యనెల్లి పిల్లకు న్యాయం, 24 మందికి శిక్షలు
ఎట్టకేలకు సూర్యనెల్లి అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగింది. కానీ న్యాయం దక్కడానికి అప్పటి బాలికకు, ఇప్పటి సమాజ వంచితకు 18 యేళ్ళ కాలం పట్టింది. మధ్యలో ఎన్నో కుట్రలు మరెన్నో మలుపులు ఆమెను, ఆమె కుటుంబాన్ని పట్టి పల్లార్చాయి. ఆమెను ఎలాగైనా దారికి తెచ్చుకోవడానికి, పెద్దవారితో పెట్టుకున్నందుకు తగిన ఫలితం అనుభవించేలా చేయడానికి జరగని ప్రయత్నం లేదు. ఆ పిల్ల తండ్రి అన్నట్లు ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం జరగనట్లయితే తన కూతురి పట్ల కోర్టులు ఇంత…