తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు
ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని…
