మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్

రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…

ఆర్.బి.ఐ రేట్ల పెంపుతో పతనమైన షేర్ మార్కెట్

శుక్రవారం జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక సారి వడ్డీ రేట్లను పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదనీ, ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమనీ ఆర్.బి.ఐ గవర్నర్ మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి పెరుగుదల రేటుకు ప్రతికూలంగా పరిణమించడంతో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని ప్రధాని ఆర్ధిక…

11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…