మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్
రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…
