స్మృతి మళ్ళీ అబద్ధం చెప్పారు!
నోరు తెరిస్తే అబద్ధమేనా? బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కూడా! తన ప్రసంగానికి భావోద్వేగాలను అద్దడం కోసం జరగనివి జరిగినట్లుగా, జరిగినవి జరగనట్లుగా చెప్పడం ఎవరికైనా తగునా? లేక దేశాన్ని ఏలుతున్నారు గనుక కేంద్ర మంత్రులకు తగుతుందా? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత ప్రజాస్వామిక దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులోనే ఆమె అబద్ధాలు చెప్పేస్తున్నారు. అది కూడా ఒక చనిపోయిన విద్యార్ధి కుటుంబం లక్ష్యంగా! రోహిత్ వేముల…
