బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…

తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునరుద్ధరణకు డిమాండ్ తలెత్తడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి: వివక్ష రెండు: నిర్లక్ష్యం తెలంగాణ కంటే ముందుగా సంపన్నులైన సీమ, ఆంధ్ర భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర ప్రదేశ్ అధికార పగ్గాలను తమ చేతుల్లో ఉంచుకోగలిగారు. తద్వారా నూతనంగా సంపన్నులవుతున్న తెలంగాణ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలకు అవకాశాలను వివిధ రూపాల్లో నిరాకరించారు. అవకాశం ఉన్న చోటల్లా వివక్ష చూపారు. అవకాశం లేనిచోట నిర్లక్ష్యం చూపారు. ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు…

తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సంగతేమో గానీ ఆ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు పరమ జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని ప్రబుద్ధులు కొందరు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి కొందరు తెలంగాణ వస్తే చాలు ఇక స్వర్గమే అన్నట్లుగా ‘అరచేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. ఇద్దరూ కలిసి అటూ, ఇటూ జనాన్ని ఎంతగా వంచించగలరో అంతా వంచిస్తున్నారు. కాకపోతే అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా…

తెలంగాణ ముసాయిదాకు రాష్ట్రపతి కవరింగ్ లెటర్

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తయారు చేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు 2013’ ముసాయిదాను రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిశీలన నిమిత్తం పంపారు. బిల్లు మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదాపై ఏమి అభిప్రాయపడుతున్నదీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెబుతూ అందుకు జనవరి 23ను తుది గడువుగా రాష్ట్రపతి నిర్దేశించారు. సదరు బిల్లు ముసాయిదాకు రాష్ట్రపతి రాసిన కవరింగ్ లెటర్ లోని అంశాలు ఇలా…

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…

సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు…

10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ నిర్ణయం

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాయల తెలంగాణ ఏర్పాటుపై సాగిన ఊహాగానాలకు దీనితో తెరపడింది. కావూరి సాంబశివరావు రాయల తెలంగాణ కోసం కేబినెట్ లో ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదని వార్తా ఛానెళ్ల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ 10 యేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 45…

రాయల తెలంగాణ కాకపోవచ్చు!

తెలంగాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జి.ఓ.ఎం సభ్యులు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతున్నట్లు సోమ, మంగళవారాల్లో దాదాపు పత్రికలన్నీ ఊహాగానాలు చేశాయి. కానీ మంగళవారం రాత్రికి జి.ఓ.ఎం సభ్యులు మళ్ళీ 10 జిల్లాల తెలంగాణే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను బి.జె.పి దృఢంగా తిరస్కరించడమే దానికి కారణం అని ది హిందు తెలిపింది. బి.జె.పి మద్దతు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ విభజన అసాధ్యం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే బి.జె.పి మద్దతు తప్పనిసరి.…

తెలంగాణ సోనియా వంటకమా? -కార్టూన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా చేతుల్లోనే ఉందన్నట్లుగా అనేకమంది అభిప్రాయపడడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణ ప్రజల ఆందోళన, ఆకాంక్షలు, చరిత్ర… ఇవేవీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం, చిత్రించడం అమాయకత్వమా, అజ్ఞానమా, మిడి మిడి జ్ఞానమా? వివిధ పార్టీల నేతలు ఇరుకు స్వభావంతో, స్వార్ధ ప్రయోజనాల కోసం అంతా సోనియాయే చేస్తున్నట్లు చెబితే చెప్పొచ్చు గాక! సోనియా వల్లనే…

హైద్రాబాద్ యు.టికి నో

తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జి.ఒ.ఎం) నుండి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఒక షాక్ లాంటిది ఎదురయింది. హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వచ్చిన సీమాంధ్ర మంత్రులకు వారు గట్టిగా ‘నో’ చెప్పేశారు. అసలు విభజనకే ఒప్పుకునేది లేదని హఠాయించిన సీమాంధ్ర మంత్రులు చివరి నిమిషంలో వచ్చి ‘కేంద్ర పాలిత ప్రాంతం’ చేయాలని కోరడం జి.ఒ.ఎం సభ్యులకు నచ్చినట్లు లేదు. ‘ఇప్పడు సమయం మించిపోయింది’ అని జి.ఒ.ఎం సభ్యులు…

విభజన బుల్ డోజర్ కు మమత అడ్డం? -కార్టూన్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నానని చెబుతున్న జగన్ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్.సి.పి నేత శరద్ పవార్, జె.డి.(యు) నేత శరద్ యాదవ్ లను ఇప్పటికే కలిశారు. వీరిలో రాష్ట్ర విభజనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎదుర్కొంటున్న మమత విభజనకు వ్యతిరేకం అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదేమో. “తెలంగాణ…

తెలంగాణ: సోనియా పంటి కింద కిరణ్ రాయి? -కార్టూన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటో ఒక పట్టాన కోరుకుడు పడడం లేదు. ఆయన ఆధిష్టానం ఆదేశాల్నే పాటిస్తున్నారా లేక ఎదురు తిరుగుతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారయింది. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ప్రయోజనాలని కాపాడడానికే ఆయన పార్టీ అధిస్టానం పన్నిన వ్యూహంలో భాగంగానే ఎదురు తిరుగుతున్నారా లేక నిజంగానే సీమాంధ్ర ధనికవర్గాల కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేశారా అన్నది తేలడం లేదు. నిజంగానే ఎదురు తిరిగే పనైతే కిరణ్ కుమార్…

ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది. ఇంకా చెప్పాలంటే నేను వేసిన…

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం -కేంద్రం

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే…