“డ్యాం 999” సినిమా ప్రదర్శనపై తమిళనాట నిషేధం

తమిళనాడు ప్రభుత్వం ‘డ్యాం 999′ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలనుండి సినిమా ప్రదర్శన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాడు. ముల్లైపెరియార్ డ్యాం ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మించారని డి.ఎం.కె పార్టీ అధిపతి కరుణానిధి ఆరోపించాడు. లోక్ సభలో బుధవారం డి.ఎం.కె ప్రతినిధులు సినిమాను నిషేధించాలని కోరారు. వైకో నాయకత్వంలోని ఎం.డి.ఎం.కె పార్టీ కూడా సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని కోరింది.…