కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

పాక్‌కి అమెరికా సాయం నిలిపివేయడాన్ని ఆహ్వానించిన ఇండియా

పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ…