‘ఓటుకి నోటు’ కుంభకోణం, రాజకియ దళారీ ‘అమర్ సింగ్’ కస్టడీకి

కేంద్ర స్ధాయిలో చాన్నాళ్ళుగా రాజకీయ దళారిగా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చిన అమర్ సింగ్‌ కటకటాల పాలయ్యాడు. ‘ఓటుకి నోటు’ కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, మొదట ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు హాజరునుండి మినహయింపు కోరుతూ పిటిషన్ వేసినప్పటికీ, చివరి నిమిషంలో కోర్టుకి హజరు కావడానికే నిశ్చయించుకున్నాడు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స జరిగినందున, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ సోకిందనీ, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలున్నాయనీ కనుక…

సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు

ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన…

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…