ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత ఆర్ధిక వృద్ధి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో రెండో క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు 2011) లో భారత ఆర్ధిక వృద్ధి గత రెండేళ్లలో అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయింది. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో విస్తరించిన కాలంలో భారత ఆర్ధిక వ్యవస్ధ కేవలం 6.9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుదల, సంక్షోభంలో ఉన్న ప్రపంచ కేపిటల్ మార్కెట్లు అన్నీ కలిసి భారత ఆర్ధిక వృద్ధిని…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…

భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…