‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు
పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా…
