జపాన్ రాయబార కార్యాలయాలపై సైబర్ దాడులు
జపాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు వివిధ దేశాల్లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయాలలోని కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయని జపాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ దాడులు జూన్ నెలనుండి జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఉన్న జపాన్ కార్యాలయాలపైనా ఈ దాడులు జరిగాయని క్యోడో వార్తా సంస్ధ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలిపాయని క్యోడో ప్రకటించింది. విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని…