విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

విభజన బుల్ డోజర్ కు మమత అడ్డం? -కార్టూన్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నానని చెబుతున్న జగన్ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్.సి.పి నేత శరద్ పవార్, జె.డి.(యు) నేత శరద్ యాదవ్ లను ఇప్పటికే కలిశారు. వీరిలో రాష్ట్ర విభజనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎదుర్కొంటున్న మమత విభజనకు వ్యతిరేకం అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదేమో. “తెలంగాణ…

పోల్: జగన్ బెయిలు దేనికి సూచన?

టి.వి ఛానెళ్ళు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన రెడ్డి జైలు నుండి విడుదల అయ్యారు. ఆయనకు స్వాగత సత్కారాలు అందించడం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారట. వారికి పోలీసులకు మధ్య వాదులాట, తోపులాట, ఘర్షణ గట్రా జరుగుతున్నాయట కూడా. “నీకిది, నాకది” (క్విడ్ ప్రో కో) పద్ధతిలో జగన్ కి చెందిన అనేక కంపెనీల్లో వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, దానికి బదులుగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి…

జగన్ కి బెయిలు వచ్చేసింది!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దర్యాప్తు పూర్తయిందని సి.బి.ఐ చెప్పడంతో కడప ఎం.పికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పెషల్ సి.బి.ఐ కోర్టు తెలిపింది. దాదాపు సంవత్సరంన్నర పైగా జైలులో గడుపుతున్న జగన్, బెయిల్ పై విడుదల కానున్న వార్త ఆయన అభిమానుల్లో సంతోషాతిరేకాలు నింపాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్న ఫలితంగా జగన్ త్వరలో విడుదల కానున్నాడని ఆరోపించిన టి.డి.పి జోస్యం నిజం అయినట్లా? జగన్ ను విషపురుగుగా అభివర్ణించిన…

మంత్రి మోపిదేవి అరెస్టు, జగన్ ముందస్తు బెయిల్ దరఖాస్తు

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చెప్పగా, ఐదు రోజుల కస్టడీకి అనుమతించినట్లు ఈ టి.వి తెలిపింది. మరో వైపు కీడు శంకించిన జగన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసినట్లు ఎన్.డి.టి.వి…