చైనా ఫోన్ కంపెనీ, యూనివర్శిటీలను హ్యాక్ చేసిన అమెరికా

“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు  వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి…

వాళ్ళు నా కుటుంబాన్ని సాధిస్తారు, అదే నా భయం -స్నోడెన్ ఇంటర్వ్యూ

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ‘నేషనల్ ఇన్వేస్టిగేటివ్ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎ) అక్రమాల గుట్టు విప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్ ది గార్డియన్ పత్రిక విలేఖరులు గ్లెన్ గ్రీన్ వాల్డ్, ఎవెన్ మకాస్కిల్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ది హిందు పత్రిక మూడు రోజుల క్రితం దీనిని పునర్ముద్రించింది. తాను ఎందుకు ఎన్.ఎస్.ఎ అక్రమాలను బైటపెట్టవలసి వచ్చింది, ఆర్ధికంగా ఉన్నతమైన తన ప్రామిసింగ్ కెరీర్ ని ఎందుకు వదులుకున్నదీ ఆయన ఇందులో వివరించారు. ఉగ్రవాదం కొత్తగా పుట్టిందేమీ కాదనీ,…

చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…

హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను…