అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి
చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు…
