లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు

లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు చోటు చేసుకున్నట్లు పి.టి.ఐ తెలిపింది. ఏప్రిల్ నెలలో చొరబడిన ప్రాంతానికి సమీపంలోనే తాజా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. చుమర్ సెక్టార్ లో చొరబడిన చైనా పి.ఎల్.ఏ బలగాలు భారత సైన్యం నిర్మించిన బంకర్లు కొన్ని ధ్వంసం చేసి కెమెరా కేబుల్స్ ను తెంచివేసినట్లు తెలిసింది. ఈ రోజు (మంగళవారం, జులై 9) వెలుగులోకి వచ్చినప్పటికీ వాస్తవానికి ఈ చొరబాటు జూన్ నెలలోనే జరిగింది. చైనా, భారత్ ల భూభాగాలను విడదీసే…