ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

చిదంబరం దగ్గర ఉల్లి ఘాటు తగ్గించే చిట్కా -కార్టూన్

చిదంబరం: “పెరిగిపోతున్న కూరగాయల ధరలకు నేను బ్రహ్మాండమైన పరిష్కారం కనిపెట్టాను – 1000 టన్నుల ఉల్లిపాయలను ఎక్కడ పాతిపెట్టారో ఈయన గారు కలగన్నారట.” ***               ***                *** ఉల్లి పాయల రేట్లు మళ్ళీ ఊపిగొట్టేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలు దాటిపోయిందని ఆంగ్ల, హిందీ ఛానెళ్ళు అదే పనిగా మొట్టుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాత్రం ఉల్లిపాయలకు వాస్తవంగా కొరత లేదని చెబుతున్నారు. వాస్తవంగా కొరత లేకుండా…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

కేంద్ర మంత్రికి ద్రవ్యోల్బణం సంతోషమేనట!–కార్టూన్

రైతుతో: ఎక్కువ అడగొద్దయ్యా! రేటు ఎక్కువైతే మళ్ళీ సగటు మనిషికి భారం కదా!        జనంతో: ధరలు పెరిగాయని గొణక్కండి. రైతులకి అదే లాభం. —————————————— ప్రజల అవసరాలతో పరాచికాలాడడం కేంద్ర మంత్రులకు ఆటగా మారినట్లుంది. ‘వాటర్ బాటిల్ కి 15/- ఖర్చు పెడతారు గానీ బియ్యం ధర రూపాయి పెరిగినా సహించలేరు’ అంటూ మధ్య తరగతి జనంపై ఏవగింపుని చాటుకున్న చిదంబరం సరసన, కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేరిపోయాడు. బియ్యం, గోధుమలు,…

జనం అంటే చిదంబరం కి ఎంత చిరాకో!

జనం అంటే తనకు చిరాకని కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం తన నోటితోనే చాటుకున్నాడు. ప్రజల ఈతి బాధలని గ్రహించి దూరం చేయవలసిన బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి వర్యులు ఐస్ క్రీమ్ పై మక్కువనీ, బియ్యం ధరల పెరుగుదలపై వ్యతిరేకతనూ పోల్చి తన ‘వర్గ బుద్ధి’ ప్రదర్శించుకున్నాడు. మీడియా సాక్షిగా తన బుద్ధి సక్రమం కాదనీ, గిరిజనుల సంపద దోచే కంపెనీలకు వత్తాసు పలకడమే కాక సాధారణ మధ్యతరగతి ప్రజల కష్టాలపై కూడా సరైన అవగాహన,…

దేశంలోని టెర్రరిస్టులే ముంబై పేలుళ్ళకు బాధ్యులు కావొచ్చు -హోం మంత్రి

జులై13 తేదీన ముంబైలో చోటు చేసుకున్న మూడు వరుస పేలుళ్ల వెనక దేశంలోపలి టెర్రరిస్టు మాడ్యూల్సే బాధ్యులు అయి ఉండవచ్చని కేంద్ర మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంటుకు తెలిపాడు. ముంబైలో మూడు చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత దేశంలో తలెత్తిన టెర్రరిస్టు మాడ్యూళ్ళు ఈ పేలుళ్లకు బాధ్యులని చెప్పడానికి సూచనలు వెల్లడయ్యాయని తెలిపాడు. “ఇంకా…

తప్పుల తడక “మోస్ట్‌వాంటేడ్” పాకిస్ధానీయుల జాబితా ఉపసంహరించుకున్న ఇండియా

కొద్ది రోజుల క్రితం టెర్రరిజం నేరాల క్రింద భారత ప్రభుత్వం ప్రచురించిన “మోస్టు వాంటేడ్ పాకిస్తానీయుల” జాబితోలో తప్పులను భారత పత్రికలు ఎత్తి చూపడంతో ఆ జాబితాను ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పలేదు. టెర్రరిజం నేరాలము పాల్పడిన పాకిస్తానీయులను తమకు అప్పజెప్పాలంటూ 50 మంది పాకిస్తాన్ దేశీయుల పేర్లను ఇండియా గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించింది. కొద్ది రోజుల క్రితం ఆ జాబితాను తన వెబ్ సైట్ లో సి.బి.ఐ ఉంచింది. జాబితాలోని కనీసం ఒక…

ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ,…