మరోసారి పోరాట పధంలో గ్రీసు ప్రజలు, కార్మిక సంఘాలు
గ్రీసు ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం పట్ల ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. త్రయం (troika) గా పిలిచే యూరోపియన్ యూనియన్ (ఇ.యు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా విధించిన నూతన షరతులను ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం పట్ల దేశవ్యాపిత నిరసనలకు పూనుకున్నారు. త్రయం ఆదేశాల మేరకు కొత్త ప్రభుత్వం విధించ తలపెట్టిన 11.5 బిలియన్ యూరోల (15 బిలియన్ డాలర్లు) కోతలను మూకుమ్మడి నిరసన…
