రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత
ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…
