‘ప్రజాస్వామ్యం’ ఎండమావికై చైనా యువత రోడ్డెక్కిన ఆ రోజులు -ఫోటోలు
సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఈ రోజుల్లోనే చైనా యువత ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం’ అనే ఎండమావి కోసం వీధులకెక్కి నినదించారు. 1911 ప్రాంతంలో ఆనాటి జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమ రధసారధి డాక్టర్ సన్ యెట్ సేన్ జ్ఞాపకాలను అపహాస్యం చేస్తూ చైనీయ యువత మిడి మిడి జ్ఞానంతో పశ్చిమ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నమ్మారు. అలాంటి ప్రజాస్వామ్యమే చైనాలో ప్రవేశపెట్టాలని కోరుతూ వేలాది మంది యువత, విద్యార్ధులు బీజింగ్ చేరుకుని చరిత్రాత్మక తీయానాన్మెన్ స్క్వేర్ లో…