గంటర్ గ్రాస్ ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ గా ప్రకటించిన ఇజ్రాయెల్

ప్రఖ్యాత జర్మన్ రచయిత గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ ‘పర్సనా నాన్ గ్రాటా’ (ఆహ్వానించ దగని వ్యక్తి) గా ప్రకటించింది. తద్వారా తన జాత్యహంకార బుద్ధిని బహిరంగంగా చాటుకుంది. పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకుని సెటిల్ మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాన్నీ, పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉంటూ ఇరాన్ అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబు దాడులు చేస్తామని ప్రకటించడాన్నీ గంటర్ గ్రాస్ తన కవిత ద్వారా విమర్శించడమే నేరంగా ఇజ్రాయెల్ పరిగణిస్తున్నది. “What Must…

ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జర్మన్ల ప్రదర్శన

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జర్మన్లు శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ వ్యాపితంగా ఉన్న డెబ్బై పైగా నగరాలలో పదుల వేలమంది జర్మన్లు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి. తెలిపింది. సాంప్రదాయక ఈస్టర్ ‘పీస్ మార్చ్’ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో, ప్రదర్శకులు నాటో దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. రాజధాని బెర్లిన్ లో  అమెరికా ఎంబసీ ముందు వందలమంది నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, పశ్చిమాసియాలోనూ అమెరికా అనుసరిస్తున్న…