అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు
ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం తరహాలో ఇండోనేషియా దేశస్ధులు బూడిద కాలం కూడా ఒకటుందని చదువుకోవాల్సిన రోజులు. అగ్ని పర్వతాలకు నిలయం అయిన ఇండోనేషియా ప్రజలకు అగ్ని కొండలు బద్దలు కావడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. సినబాంగ్ అగ్ని పర్వతం ఆరు నెలల కాలంలో మూడోసారి బద్దలై నిప్పులు చెరుగుతుండగా దానికి కెలుద్ అగ్ని పర్వతం కూడా జత కావడంతో అనేక మంది మరణించారు. ఫిబ్రవరి 14 తేదీన జావా ద్వీపంలోని…
