ఎన్నికలలోపు ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’ -ప్రధాని
మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన…