మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…