తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ

Special Intensive Revision in Bihar బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది. తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా…

బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు

“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది. బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా…

లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…

మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు: జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు? 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే…

2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…

2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?

2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…