అమెరికా: మట్టి పెళ్ల కూలి ఓ పట్నం మాయం -ఫోటోలు
వాషింగ్టన్ రాష్ట్రంలోని ఓసో పట్నం వాసులకు మార్చి 22 ఓ మహా దుర్దినం అయింది. అప్పటికి మూడు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చరియ కూలిపోవడంతో దానికింద పడి ఆ పట్నం దాదాపు అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకూ 17 మంది మరణించారని ప్రకటించగా 90 మంది జాడ తెలియలేదు. వీరంతా చనిపోయారన్న నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చేశాయి. వారి బంధువులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. స్ధానికులు ఈ కొండను ‘స్లైడ్…