చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…

శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…