పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం…

గొడవకి కారణమైన ‘అంబేద్కర్ కార్టూన్’ ఇదే -కార్టూన్

శుక్రవారం లోక్ సభలో జరిగిన గొడవతో ఎన్.సి.ఇ.ఆర్.టి సెలక్షన్ కౌన్సిల్ సభ్యులూ, ఛీఫ్ సలదారులూ అయిన ఇద్దరు రాజీనామా చేయవలసి వచ్చింది. దళిత ఎం.పిలు గొడవ చేయడంతో ప్రముఖ కార్టూనిస్టు శంకర్ కార్టూన్ ఉన్న పదకొండవ తరగతి రాజకీయ శాస్త్రం లో ఒక పాఠ్యాంశంగా ఉన్న పుస్తకాన్ని తొలగిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సీబాల్’ ప్రకటించాడు. ఆయనతో పాటు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా కార్టూన్ అలా గీయవలసింది కాదని వ్యాఖ్యానించారు. కార్టూన్…

అంబేడ్కర్ కార్టూన్ పై ఇంత రగడ అవసరమా? -కార్టూన్

శుక్రవారం పార్లమెంటులో అంబేడ్కర్ కార్టూన్ విషయంలో జరిగిన రగడ కు స్పందనగా ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు ‘సురేంద్ర’ గీసిన కార్టూన్ ఇది. మమత బెనర్జీ పై గీసిన కార్టూన్ ని ఈమెయిల్ ద్వారా ఇతరులకు పంపాడన్న కారణంతో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కేసులు పెట్టి వేధించడాన్ని దేశం మొత్తం ఖండించింది. దేశ రాజకీయ నాయకులతో పాటు, అనేక మంది స్కాలర్లు, విద్యావేత్తలు, రాజకీయ వేత్తలు మెచ్చిన కార్టూనిస్టు ‘శంకర్’ గీసిన కార్టూన్ అరవై అయిదేళ్ల…

అంబేడ్కర్ కార్టూన్ పై సిబాల్ ‘సారీ’, ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా

ఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేడ్కర్ కార్టూన్ పై లోక్ సభలో దళిత ఎం.పిలతో పాటు పలువురు ఎం.పి లు ఆందోళన చేయడంతో మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ క్షమాపణ…