రు. 76 వేల కోట్ల వసూలు ఇక కష్టమే -సెబి

కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది. సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు…

విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్… తదితర కంపెనీల అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు భారత దేశంలోని అప్పు ఎగవేతదారులకు సింబల్! యునైటేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యు.బి.ఐ), ఆయనను ఉద్దేశ్యపూర్వక పన్ను ఎగవేతదారు (Wilful defaulter) గా ప్రకటించినప్పటి నుండి ఆయనకు ఆ కీర్తి దక్కింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఈ బిరుదు దక్కించుకున్న ఏకైక/మొట్టమొదటి పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాయే కావచ్చు. అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న విజయ్ మాల్యా,…

బ్యాంకుల నికర నిరర్ధక ఆస్తులు 1.3 లక్షల కోట్లు!

ప్రభుత్వ పధకాల కింద కూడా సామాన్యులకు అప్పులు నిరాకరించే బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రం పిలిచి అప్పులిస్తాయి. ఆ అప్పులు వసూలు కాక తామే ఋణ గ్రహీతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. చివరికి ప్రభుత్వాలు ప్రకటించే స్కీముల క్రింద తీరని అప్పులను నిరర్ధక ఆస్తుల (Non-Performing Assets -NPAs) కింద నెట్టేస్తాయి. ఇలా వసూలు కానీ బాకీల విలువ 2013-14 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో 38 శాతం పెరిగి 1,28,533 కోట్లకు చేరిందని ఎన్.పి.ఏ సోర్స్…