ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం
చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…