ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం

చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…

ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…