పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…

ఎన్.డి.ఎ కి జె.డి(యు) రామ్ రామ్

పత్రికలు ఊహించినట్లే జరిగింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) కి రామ్ రామ్ చెప్పేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి పరోక్షంగా ప్రకటించిన వారం రోజులకి ఆ పార్టీ ప్రతిపక్ష కూటమి నుండి బిచాణా ఎత్తేసింది. ప్రస్తుత పాలక్ష కూటమి లోకి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా చేరుతుందో లేదో గానీ ఇప్పటికైతే బీహార్ లో పరిస్ధితిని సవరించుకునేలో పడింది. బి.జె.పి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించి జూన్ 19…

విచ్ఛిన్నం దారిలో ఎన్.డి.ఎ -కార్టూన్

జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) విచ్ఛిన్నం దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. బి.జె.పితో సంబంధాలు అంత బాగా లేవని ఎన్.డి.ఎ కన్వీనర్ శరద్ యాదవ్ శుక్రవారం స్పష్టం చేసేశారు. ఇప్పటిడైతే ఎన్.డి.ఎ ఉనికిలోనే ఉంది అని చెబుతూనే ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో అంగీకరించిన కనీస కార్యక్రమానికి, అవగాహనకి భిన్నంగా పరిస్ధితులు పోతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడాన్ని ఆయన ఉద్దేశించారని స్పష్టమే. ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో బి.జె.పి…