పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి

కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ మెరైన్లను పైరసీ వ్యతిరేక చట్టం కింద విచారించడానికి భారత హోమ్ శాఖ అనుమతి ఇవ్వడంపై ఇటలీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఇటలీ విదేశీ మంత్రి ఆదివారం ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించగా సోమవారం ఇ.యు కూడా దాదాపు అదే తరహాలో హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను అన్యాయంగా విచారిస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఇటలీ, ఇ.యులు అల్టిమేటం జారీ చేశాయి. “మా మెరైన్లకు వ్యతిరేకంగా జరగబోయే లీగల్…

భారత్ రాయబార విజయం, తిరిగి రానున్న ఇటలీ మెరైన్లు

ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన…

ఎన్రికా లెక్సీ: ఇటలీ నౌక, సిబ్బంది వెళ్లిపోవడానికి సుప్రీం అనుమతి

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న…

ఎన్రికా లెక్సీ: కేరళను నిలదీసిన సుప్రీం కోర్టు

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటాలియన్ నౌక రక్షణ బలగాలు కాల్చి చంపిన కేసులో కేరళ ప్రభుత్వ అవగాహనను సుప్రీం కోర్టు నిలదీసింది. నౌక యజమానులు, జాలర్ల కుటుంబాలు కుదుర్చుకున్న ‘రాజీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదని సుప్రీం కోర్టు బెంచి నిలదీసింది. “భారత న్యాయ వ్యవస్ధకే ఇది సవాలు లాంటిది. ఇది అనుమతించరానిది. అత్యంత దురదృష్టకరం” అని ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఒక్క కోటుంబానికి నౌక యజమానులు కోటి…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…