ధర్డ్ ఫ్రంట్: మద్దతిస్తాం… అబ్బే, ఇవ్వం… -ఎఎపి

ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం…

ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా

అవినీతిపరులయిన రాజకీయ నాయకుల జాబితాను తయారు చేశామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహా నాయకులని భావిస్తున్నవారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకుల పేర్లతో కూడిన ఈ చిట్టాలో స్ధానం సంపాదించినవారికి వ్యతిరేకంగా ఎఎపి తన అభ్యర్ధులను నిలుపుతుందని కేజ్రీవాల్ తెలిపారు. తమ జాబితాలో రాహుల్ గాంధీ ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం…

ఎఎపి వెనుక ఫోర్డ్ ఫౌండేషన్?

ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్ధలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఎఎపి కి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్.ఐ ల పేరుతో అమెరికా నుండి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు.…

గొర్రెని చూసి పులి చారల్ని చెరిపేసుకున్నట్లు…

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా? ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో…

ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్

అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…

ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఒక్కో రోజూ తీసుకుంటున్న పాలనా చర్యలు స్వతంత్ర పరిశీలకులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తాము ఎఎపి లో చేరుతున్నామని ప్రకటింస్తున్నారు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులయిన ప్రముఖులు వీరిలో ఉండడం విశేషం. మరోవైపు పెద్ద పెద్ద పార్టీలు నైరాశ్యపు చలికి మునగడ తీసుకుని ఎఎపి ఆకర్షక గాలికి తట్టుకోవడం ఎలాగా అని ఆందోళనలో పడిపోయాయని కార్టూన్ సూచిస్తోంది. నరేంద్ర మోడి రాష్ట్రం గుజరాత్ లో ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్…

కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…