నాలుగు రాష్త్రాలుగా ఉత్తర ప్రదేశ్ విభజనకు అసెంబ్లీ అంగీకారం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, తమ రాష్ట్రాన్ని పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ప్రకటించింది. చిన్న రాష్ట్రాలు…