గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ కేసు నమోదు చేస్తాం -అమెరికా ఎఫ్.టి.సి

యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో…

గూగుల్ చైనాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం

గత సంవత్సరం చైనానుండి గూగుల్ తన వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నంత పని చేసిన గూగుల్ చైనా ప్రభుత్వంతో తన ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత సంవత్సరంలో వలే నేరుగా చైనా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపనప్పటికీ గూగుల్‌కి చెందిన జి-మెయిల్ ఎకౌంట్ల ఐ.డి లను పాస్ వర్డ్ లను దొంగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఇవి చైనా లోని జినాన్ నుండి జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ఫిషింగ్ ప్రక్రియ ద్వారా జిమెయిల్ వినియోగదారుల ఐ.డి, పాస్ వర్డులను సంపాదించి…

కొత్త సర్వీసు కోసం ‘పేపాల్’ వ్యాపార రహస్యాలను దొంగిలించిన ‘గూగుల్’?

గూగుల్ పాపాల జాబితాలో మరొక పాపం చేరింది. శిశుపాలుడి పాపాలను శ్రీ కృష్ణుడు వందవరకే అనుమతించాడు. గూగుల్ పాపాలకు మాత్రం అంతూ పొంతూ ఉండడం లేదు. ప్రమాద వశాత్తూ బిలియనీర్ అయిన కంపెనీల్లో ఒకటిగా మొదట పేరు పొందిన గూగుల్ ఆ తర్వాత నియమ నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తూ, ఒక మాదిరి కంపెనీలన్నింటినీ అక్విజిషన్ల ద్వారా మింగివేస్తూ అనతి కాలంలోనే అతి పెద్ద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో…

డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో…