కాప్టర్ కుంభకోణం: ఎ.పి గవర్నర్ ని విచారించిన సి.బి.ఐ

హెలికాప్టర్ల కుంభకోణంలో సి.బి.ఐ విచారణకు నోచుకున్న గవర్నర్ల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కూడా చేరిపోయారు. కుంభకోణానికి దారి తీసిన నిర్ణయం జరిగిన కీలక సమావేశంలో అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ కూడా పాల్గొనడంతో సి.బి.ఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ మేరకు సి.బి.ఐ బృందం ఒకటి హైద్రాబాద్ వచ్చి గవర్నర్ కు విచారించింది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యు.పి.ఎ నియమించిన ఇద్దరు…