ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…