ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు

ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…

ఇటలీ మెరైన్ కేసు: ఇండియాకు ఇ.యు హెచ్చరిక

ఇద్దరు కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాలో విచారణ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వల్ల యూరోపియన్ యూనియన్, ఇండియాల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చని ఇ.యు హెచ్చరించింది. యూరోపియన్ కమిషన్ (ఇ.యు ఎక్జిక్యూటివ్ బాడీ) అధ్యక్షుడు జోస్ మాన్యుయెల్ బరోసో, ఇటలీ ప్రధాని ఎన్రికో లెట్టాల మధ్య మూడు రోజుల క్రితం బ్రసెల్స్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బరోసో ఈ హెచ్చరిక…

భారత్ రాయబార విజయం, తిరిగి రానున్న ఇటలీ మెరైన్లు

ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన…

మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం

– భారత సుప్రీం కోర్టు సోమవారం ఉగ్రరూపం దాల్చింది. హామీని ఉల్లంఘించిన ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని పైన విరుచుకుపడింది. దేశం విడిచి వెళ్లరాదని మార్చి 14 తేదీన తాము ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. వియన్నా సదస్సు లో అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ రాయబారులకు వర్తించే ‘నేర విచారణ నుండి మినహాయింపు‘ (immunity) డేనియల్ కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక పిటిషనర్ గా కోర్టులో ఒక ప్రక్రియను ప్రారంభించిన…

దేశం వదిలి వెళ్లొద్దు, ఇటలీ రాయబారికి సుప్రీం ఆదేశం

ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటాలియన్ మెరైన్లను ఇండియాకి తిరిగి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు అసాధారణ చర్య చేపట్టింది. ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని తమ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఫిబ్రవరి 24-25 తేదీలలో జరిగిన ఇటలీ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి తిరిగి వెనక్కి వస్తామని మెరైన్లు సుప్రీం కోర్టును కోరగా వారికి ఇటలీ రాయబారి హామీగా నిలిచాడు.…

ఇటలీ నమ్మక ద్రోహం!

అసలే ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న ఇండియా, ఇటలీ సంబంధాలు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత క్షీణించే పరిస్ధితి ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసొస్తామని చెప్పి వెళ్ళిన భారతీయ జాలరుల హంతకులను తిరిగి ఇండియాకి పంపేది లేదని ఇటలీ ప్రకటించింది. రాయబార చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తాము చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యాలయానికి సోమవారం రాత్రి సమాచారం వచ్చినట్లు…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…

ఎన్రికా లెక్సీ: ఇటలీ నౌక, సిబ్బంది వెళ్లిపోవడానికి సుప్రీం అనుమతి

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…