డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్

త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది. పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి),…

‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో…

అబ్బే, ఇండియాకి ఆ హోదాం మేం ఇవ్వలేదు -పాక్ ప్రధాని గిలాని

భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు. “ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న…

అణ్వాయుధ సామర్ధ్యంపై పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటాం -పాక్, ఇండియా

అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం…