కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…