ఆర్.టి.ఐ పరిధిలో మోడి, వాజ్ పేయ్ ఉత్తర ప్రత్యుత్తరాలు?

2002 నాటి గుజరాత్ మారణకాండ కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరలో బహిరంగం కావచ్చని తెలుస్తోంది. అయితే దీనికి గుజరాత్ ప్రభుత్వం మరియు, ముఖ్యమంత్రి మోడిల అనుమతిని ప్రధాన మంత్రి కార్యాలయం కోరుతున్నట్లు తెలుస్తోంది. గోధ్రా రైలు దహనం అనంతర కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రి ల మధ్య జరిగిన సంభాషణను వెల్లడి చేయాలంటూ ఆర్.టి.ఐ కార్యకర్త ఒకరు దరఖాస్తు చేయగా దానిని ప్రధాన మంత్రి…

సి.ఐ.సి వేటగాడొస్తే పార్టీల పక్షులన్నీ ఐక్యమౌతాయ్ -కార్టూన్

రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ. రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్…