అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…

లంచం ఆరోపణలపై చర్య తీసుకోడానికి ఆర్మీ చీఫ్ ఇష్టపడలేదు -రక్షణ మంత్రి

మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణల వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. లంచం విషయం తనకు చెప్పినపుడే చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కి సూచించాననీ, అయినా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనీ, “ఆ విషయంలో మరింత ముందుకెళ్ళాలనుకోవడం లేద”ని ఆర్మీ చీఫ్ తనతో అన్నాడనీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని రాజ్య సభలో ప్రకటించాడు. ఆ సమయంలో లంచం విషయంలో మరింత…

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ ప్రయాణాల ఖర్చు రు.205 కోట్లు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ…

Coal scam-Wind fall gains

“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్

ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ…

రు. 10.67 లక్షల కోట్ల ‘బొగ్గు కుంభకోణం’ బట్టబయలు చేసిన సి.ఏ.జి

వేలం వేయకుండా ప్రవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి ఏకంగా 10.67 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని రాజ్యాంగ బద్ధ సంస్ధ ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి) గురువారం వెల్లడించింది. విలువ రీత్యా 1.76 లక్షల కోట్ల 2 జి కుంభ కోణం కంటే ఇది ఆరు రెట్లు పెద్దది. 2004-2009 మధ్య కాలంలో 155 ఏకరేజ్ ల బొగ్గు గనులను వేల వేయకుండా 155 కంపెనీలకు…

రైలు ఛార్జీల పెంపుదల మమత కి ముందే తెలుసు -ఎన్.డి.టి.వి

తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు…

Agri labour

‘ఉపాధి హామీ పధకం’ కి బడ్జెట్ లో నిధుల కత్తిరింపు

ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన…

Budget 2012-13

2012-13 బడ్జెట్ -కార్టూన్

(ఫస్ట్ పోస్టు నుండి) సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా” గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు. గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం…

బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు

2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటు లో బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంచనాలు: మొత్తం బడ్జెట్ అంచనా: రు. 14.9 లక్షల కోట్లు (14,90,925 కో). ఇది 2011-12 బడ్జెట్ కి 29 శాతం ఎక్కువ. ప్రణాళికా ఖర్చు: రు. 5,21,025 కోట్లు. గత సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ఖర్చులో ఇది 35 శాతమే. ప్రణాళికేతర ఖర్చు: రు. 9,69,900 కోట్లు.…

All options for Greece

అన్నీ టెబుల్ మీదే ఉన్నాయి -కార్టూన్

“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు,…

భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…

ఛార్జీలు పెంచిన రైల్వే బడ్జెట్ 2012-13

కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీలు పెంచడానికే నిర్ణయింకుకున్నాడు. 2012 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 14, బుధవారం ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేవేశపెట్టాడు. కొద్దిగానే పెంచానని మంత్రి చెబుతున్నప్పటికీ పెంచినవన్నీ ప్రయాణీకులపై భారం పడవేసేవే. రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వ, ప్రవేటు వేతన జీవుల నిజ వేతనాలు బాగా పడిపోయినందున ఎంత పెంచినా ప్రయాణీకుల జేబుకు ఇప్పటికే ఉన్న చిల్లుల్ని పెద్దవి చేసేవే. కిలో మీటరుకి…

European Union -Tracks never meet

యూరోపియన్ యూనియన్, యూరోజోన్: ఎన్నడూ కలవలేని పట్టాలు -కార్టూన్

యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న రుణ సంక్షోభం ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్ధితిని ఈ కార్టూన్ సూచిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) దాని సభ్య దేశాల మధ్య రాజకీయ ఐక్యతను సూచించే సంస్ధ కాగా, యూరో జోన్ (ఇ.జెడ్) సంస్ధ దాని సభ్య దేశాల కోశాగార ఐక్యత (ఫిస్కల్ యూనిటీ) ని సూచించే సంస్ధ. ఇ.యులో 27 సభ దేశాలు ఉన్నాయి. వీటిలో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి…

అమెరికా కంటే చైనా పార్లమెంటు సభ్యులే సంపన్నులు -సర్వే

అమెరికా, చైనా దేశాల పార్లమెంటు సభ్యులలో ఎవరు ఎక్కువ సంపన్నులై ఉంటారు? సాధారణంగా అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులే ఎక్కువ సంపన్నులై ఉంటారని భావిస్తాం. కానీ అది నిజం కాదని ‘బ్లూమ్ బర్గ్’ పత్రిక చెబుతోంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులతో గానీ, చైనా కమ్యూనిస్టు పార్టీ లోని ఉన్నత స్ధానాల్లో ఉన్న నాయకులతో గాని పోల్చి చూస్తే అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులు కడు పేదలని ఆ పత్రిక చెబుతోంది. అమెరికా కాంగ్రెస్ లో మొత్తం…

ఇండియా అగ్రరాజ్యం అయ్యే ఛాన్సే లేదు -అధ్యయనం

అగ్ర రాజ్యంగా అవతరించాలని కలలు కంటున్న భారత దేశానికి ఆ అవకాశాలు కనుచూపు మేరలో లేవని “లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” (ఎల్.ఎస్.ఇ) జరిపిన అధ్యయన నివేదిక తేల్చింది. అనేకమంది భారతీయ స్కాలర్లు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2009లో భారత్ సందర్శిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ “ఇండియా కేవలం ప్రాంతీయ శక్తి కాదు, అదొక ప్రపంచ శక్తి” అని ప్రకటించడాన్ని కొట్టి పారేసింది. ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆర్ధిక వృద్ధి సాధించడంలోనూ,…